Navneet Rana: మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా సెగలు చల్లారలేదు.. నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్ట్

Navneet Rana: మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు

Update: 2022-04-23 14:40 GMT

Navneet Rana: మహారాష్ట్రలో హనుమాన్‌ చాలీసా సెగలు చల్లారడం లేదు. మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ కింద కేసులు నమోదు చేశారు. అంతకుముందు మహారాష్ట్రలో రోజంతా హైడ్రామా కొనసాగింది. సీఎం ఉద్ధవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ ఛాలీసా చదువుతామంటూ ఎంపీ నవనీత్‌ కౌర్‌ హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు.. నవనీత్‌ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

ఓ దశలో ఎంపీ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు శివసేన కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారీకేడ్లు ధ్వంసం చేసి ముందుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బయటి వ్యక్తులు మాతోశ్రీ వద్దకు వచ్చి హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తామంటే శివసైనికులు ఊరికే కూర్చుంటారా అంటూ ప్రశ్నించారు. మీరు మా నివాసానికి వస్తామని సవాల్‌ విసిరితే.. అదే తరహాలో సమాధానం చెప్పే హక్కు తమకు కూడా ఉంటుందని సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Tags:    

Similar News