ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఆయన ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారని సమాచారం. ఈ నెల నెల 10న ఫ్రాన్స్కు, 12 న అమెరికాకు వెళతారని తెలుస్తోంది. మోడీ రెండు రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. రెండు రోజుల పారిస్ పర్యటనను ముగించుకుని అటు నుంచి అటే మోడీ అమెరికాకు వెళ్తారని తెలుస్తోంది. 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోడీ.. 13వ తేదీన ట్రంప్తో భేటీ అవుతారని సమాచారం. అయితే మోదీ పర్యటనపై అధికారికంగా సమాచారం లేదు. పారిస్లో జరిగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోదీ ఫ్రాన్స్ దేశానికి వెళ్లనున్నారు. 11వ తేదీ వరకూ ఆయన అక్కడ ఉంటారు. కాగా పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.