ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ వయనాడ్ ఎంపీగా ప్రమాణం స్వీకరించారు. ఉదయం తల్లి సోనియా, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వద్రాతో కలిసి ఆమె పార్ల మెంటుకు వచ్చారు. కేరళ సంప్రదాయాన్ని తలపించే ఆహార్యంతో ఆమె పార్లమెంటు ఆవ రణకు చేరుకోగానే కాంగ్రెస్ ఎంపీలు ఘనస్వా గతం పలికారు. ఆమె రాజ్యాంగాన్ని చేతబూని హిందీలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె 4 లక్షల 10 వేల 931 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇదే స్థానంలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ గాంధీ 3.64లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన రాజీనామా చేయడంతో అదే స్థానం నుంచి పోటీ చేసిన ప్రియాంక ఆ మెజార్టీని అధిగమించడం విశేషం. దేశ ప్రజల సమ స్యలను ప్రస్తావిస్తూ మోదీ సర్కారు తీరుపై విమర్శలు చేస్తున్నారు రాహుల్ . ఇవాళ రాహుల్ కు సోదరి ప్రియాంక తోడయ్యారు. ఆమె కూడా ఇకపై లోక్ సభలో వయనాడ్ ఎంపీగా తన వాయిస్ వినిపించబోతున్నారు. దీంతోపాటు ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభలో ప్రజల లోక్ సభలో అన్నా చెల్లెళ్లు లోక్ సభలో విపక్షనేతగా రాహుల్ గాంధీ తన పక్షాన పోరాడనున్నారు.