వక్స్ సవరణ బిల్లుకు విపక్షాల ఆందోళ నల మధ్య రాజ్యసభ ఆమోదం తెలిపింది. వక్స్ బోర్డు 2024 సవరణ బిల్లుపై నివేదికను 'జేపీసీ’ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) ఇవాళ రాజస భలో సమర్పించింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర నిరసనల మధ్యే రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్ఫర్ బిల్లుకు ఆమోదం తెలిపారు. జేపీసీకి చైర్మన్ గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను సభ ముందుకు తీసుకొచ్చారు. బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ సభ్యులు సూచించిన 14సవ రణలను కమిటీ ఆమోదించింది. అయితే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ), ఏఐఎం ఐఎంతోసహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. నివేదికపై విపక్షపా ర్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు. తాము సమర్పించిన అసమ్మతి నోట్ను తొలగించారం టూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో 20 నిమిషా లపాటు గందరగోళం నెలకొంది. అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్ప టికీ విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్షాల నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.