Ratan Tata : సక్సెస్‌ కు కేరాఫ్ అడ్రస్‌ రతన్ టాటా.. ప్రారంభించిన ప్రతి వ్యాపారం సక్సెస్

Update: 2024-10-10 10:15 GMT

రతన్ టాటా...ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఓ నమ్మకం..ఓ బ్రాండ్. ఎంత సంపాదించినా కూడా విలువలతో ఎలా బ్రతకాలో ఆయనను చూసే నేర్చుకోవాలి అని ప్రజలు అంటుంటారు. ప్రారంభించిన ప్రతి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి సక్సెస్‌ కు కేరాఫ్ అడ్రస్‌ గా మారారు. తాను కేవలం పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. గొప్ప మానవతావాదిగా కూడా పేరు సంపాదించుకున్నారు. 86 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యల​తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో రతన్ టాటా తుదిశ్వాస విడిచారు. చివరి శ్వాస వరకు 'కంట్రీ ఫస్ట్' అనే సిద్ధాంతాన్ని అనుసరించిన ఆయన మరణ వార్త తెలిసి యావత్ భారత్ కన్నీరుపెట్టుకుంది. దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. వ్యాపారంలో,దాతృత్వంలో శాశ్వత ముద్ర వేసిన రతన్ టాటా గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు చూద్దాం.

1937 డిసెంబర్ 28న ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆ తర్వాత రతన్ టాటాను నావల్ టాటా దత్తత తీసుకున్నారు. రతన్ టాటాకు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా ముత్తాత అవుతారు. అయితే రతన్ టాటాకు పదేళ్లు ఉండగా అంటే.. 1948లో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టాటా అమ్మమ్మ అయిన నవాజ్‌బాయి టాటా ఆయన్ను దత్తత తీసుకుని.. పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల విడాకుల ప్రభావం రతన్ టాటాపై పడకుండా విలువలతో పెంచారు.

భారత్ తో పాటు అమెరికాలో కూడా టాటా చదువుకున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. రతన్ టాటా అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నాన్నకు ఇష్టం లేకున్నా కూడా ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో.. లాస్ ఏంజెల్స్‌‌లో రతన్ టాటాకు జాబ్ దొరికింది. అక్కడే రెండేళ్లు పనిచేశారు. లాస్ ఏంజెల్స్‌లో జాబ్ చేస్తున్న సమయంలోనే.. రతన్ టాటా ప్రేమలో పట్టారు. ఆయన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. అయితే ఆ అమ్మాయితో టాటాని పెళ్లి చేసుకొని భారత్ వచ్చి స్థిరపడటానికి నిరాకరించింది. టాటాను కాదని ఆమె మరొకరిని పెళ్లి చేసుకుంది. టాటా తన లైఫ్ లో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయని..అయితే అవన్నీ ఫెయిల్ అని చాలా సందర్భాలలో స్వయంగా చెప్పారు.

భారతదేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా. గుండుసూది నుంచి విమనాల వరకు వ్యాపారంలో తన సత్తా చూపెట్టారు. 1962లో టాటా గ్రూప్ లో చేరారు. మొదటి ఉద్యోగం టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌ను నిర్వహించడం. టాటా సంస్థలను స్టెప్ బై స్టైప్ ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లారు. టాటా గ్రూప్ సంస్థలను ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. 1991లో ఆటో సే స్టీల్ గ్రూప్‌కి ఛైర్మన్ అయ్యారు. ఒక శతాబ్దం క్రితం తన ముత్తాత స్థాపించిన సమ్మేళనాన్ని 2012 వరకు నడిపారు.

టీసీఎస్‌ను రతన్ టాటా 2004లో స్థాపించారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఉక్కు తయారీ సంస్థ కోరస్, బ్రిటిష్ ఆటోమోటివ్ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటిష్ టీ కంపెనీ టెట్లీతో చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇది టాటాను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చింది.

1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. 10వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని లక్షల కోట్లకు చేర్చారు. అనేక స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వాటిని ప్రోత్సహించారు. 2016–17 మధ్య మరోసారి టాటా గ్రూప్ కి తాత్కాలిక చైర్మన్ గా కొన్ని రోజులు బాధ్యతలు చేపట్టారు. టాటా సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించారు. విదేశాల్లో కూడా ఆయన వ్యాపారాలను ప్రారంభించారు. 100కి పైగా దేశాల్లో టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయాలు 40 రెట్లు..లాభాలు 50 రెట్లు పెరిగాయి.

నానో కారు రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్. 2009లో కేవలం లక్ష రూపాలకే సామాన్యుడికి అందుబాటులో ఉండేలా కారుని మార్కెట్ లోకి తీసుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారును మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి తెస్తానన్న తన వాగ్దానాన్ని నెరవేర్చారు. అయితే అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది.

రైటైర్మెంట్ తర్వాత సామాజిక సమస్యలపై దృష్టి పెట్టారు. ఆయనకు సేవా గుణం ఎక్కువ.తన సంపదలో 60–65 శాతం దాతృత్వానికే కేటాయించారు. అతని నాయకత్వంలో టాటా గ్రూప్ భారతదేశంలోని గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో 28 మిలియన్ డాలర్ల టాటా స్కాలర్షిప్ నిధిని ఏర్పాటు చేసింది. 2008లో ఆయనకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ని ఇచ్చి గౌరవించింది భారత ప్రభుత్వం.

జంషెడ్ టాటా కాలం నుంచి వర్షాకాలంలో వీధి కుక్కలను లోపలికి అనుమతించిన చరిత్ర బాంబే హౌస్‌కు ఉంది. రతన్ టాటా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన బాంబే హౌస్ ప్రధాన కార్యాలయంలో వీధి కుక్కల కోసం ఒక కెన్నెల్ ఏర్పాటు చేశారు. ఇందులో వీధి కుక్కలకు ఆహారం, నీరు అందిస్తున్నారు. 2008లో ముంబైలో తాజ్ హోటల్ లో జరిగిన ఉగ్రదాడిలో గాయపడిన వాళ్ల కుటుంబాలను పూర్తిగా ఆదుకొని గొప్ప మనిషి అనిపించుకున్నారు.

Tags:    

Similar News