RBI: ఆర్‌బీఐకి బాంబు బెదిరింపులు.. నెలలో రెండోసారి

రష్యన్‌ భాషలో దుండగుల బెదిరింపులు..;

Update: 2024-12-13 05:30 GMT

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ కు ఈ మెయిల్ ద్వారా పంపిన బెదిరింపుల్లో బ్యాంకును పేల్చివేస్తామంటూ రష్యన్‌ భాషలో గుర్తు తెలియని వ్యక్తులు దీన్ని పంపించారు. దీనికి సంబంధించి ముంబైలోని మట రమాబాయ్‌ మార్గ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఈ-మెయిల్ పంపిన వ్యక్తి ఆచూకీ కోసం ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, 2024 నవంబర్ 16వ తేదీన కూడా ఆర్బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. అప్పుడు కాల్ చేసిన వ్యక్తి “లష్కరే-ఇ-తైబా యొక్క సీఈఓ అని పేర్కొన్నాడు. కాల్ చేయడానికి ముందు ఫోన్‌లో దుండగుడు పాట పాడినట్లు సమాచారం. కాగా, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ 2008 ముంబై దాడులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటిగా నిలిచింది.

Tags:    

Similar News