Sabarimala: శబరిమల అయ్యప్ప క్షేత్రానికి 15 రోజుల్లో రూ.92 కోట్లు
గతేడాదితో పోలిస్తే ఆదాయం 46.86 శాతం ఎక్కువ
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో రూ.69 కోట్లు వసూలయ్యాయని, ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచి రూ.47 కోట్లు సమకూరినట్లు టీడీబీ వివరించింది. హుండీ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగిందని వెల్లడించింది. గతేడాది మండల-మకరవిలక్కు సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నవంబరు 30 వరకు దాదాపు 13 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లు బోర్డు తెలిపింది.
మండల- మకరవిళక్కు వేడుకలు ప్రారంభమైన 17వ తేదీ నుంచి ఈనెల 1వ తేదీ అంటే తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్లో రూ.69 కోట్లు వసూలైనట్లు తెలిపింది. ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల ద్వారానే అధిక ఆదాయం వచ్చినట్లు టీడీబీ తెలిపింది. దాదాపు రూ.47 కోట్లు సమకూరినట్లు వివరించింది.
గతేడాదితో పోలిస్తే ప్రసాదం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం 46.86 శాతం ఎక్కువ అని పేర్కొంది. గత సీజన్లో తొలి 15 రోజుల్లో కేవలం రూ.32 కోట్లు మాత్రమే సమకూరినట్లు టీడీబీ వెల్లడించింది. హుండీ ఆదాయం గత సంవత్సరంతో పోల్చుకుంటే 18.18 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. నవంబర్ 30 వరకూ దాదాపు 13 లక్షల మంది భక్తులు శబరిమలను సందర్శించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.