2025లో జరిగిన వరుస విషాదాలు దేశాన్ని శోక సంద్రంలో ముంచేశాయి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయేలా చేశాయి. ఈ ఏడాది జరిగిన విషాద ఘటన పహల్గామ్ ఎటాక్. బరితెగించిన ఉగ్రమూకలు మతం ఆధారంగా రక్తపుటేరులు పారించడం భారత్ను తీవ్రంగా వేధించింది. ఈ ఎటాక్లో అమాయక పౌరులు 26 మంది చనిపోయారు. ఆ తరవాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్.. పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే పాక్ దాడుల్లో భారత సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా కొందరు కన్నుమూశారు. బెంగుళూరులో చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా తీవ్ర వేదనను మిగిల్చింది.
అన్ని విషాదాలే
ఢిల్లీలో తొక్కిసలాట, కుంభమేలా తొక్కిసలాట కూడా ఈ ఏడాదే జరిగాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటనతో దేశంలో మరోసారి విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటూ విమానం కూలిన భవనంలో కొందరు డాక్టర్లు కూడా మరణించారు. దీంతో మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పుడు ఈ విమాన ప్రమాదం జరగటంతో 2025 అంతా విషాద ఘటనలే చోటు చేసుకుంటున్నాయనే చర్చ మొదలైంది. దీంతో నెటిజన్లు ఏం చేసినా ఎలా చేసినా మృత్యువు వెంటాడుతోందని కామెంట్ చేస్తున్నారు.
జూన్ నెల విషాదాలు
మన దేశాన్ని జూన్ నెల విషాదం వెంటాడుతోంది. ఈ నెలలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కన్నుమూయడం దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. 2023 జూన్ 2న ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. దేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 260మందికిపైగా మరణించారు. ఈ ఘోర రైలు ప్రమాదంలో 900 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ విషాదం నుంచి కోలుకుంటుండగానే పంజాబ్లో మరో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కూడా జూన్ 2వతేదీనే జరగడం మరింత కలచివేసింది. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్లో రైలు ప్రమాదం జరిగిన ఈ రైలు ప్రమాదం అందరిలోనూ భయాదోళనలను పెంచింది. తొలుత రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలుకు చెందిన ఇంజన్ బోల్తా పడి, ప్యాసింజర్ రైలును ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. 2023, 2024 సంవత్సరాల్లో జూన్ నెలలోనే ప్రమాదాలు జరగగా... ఈ ఏడాది జూన్ 12న గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఎయిరిండియా విమానం కుప్పకూలడంతో 241 మంది మరణించగా... విమానం మెడికో హాస్టల్పై కూలడంతో మరో 30 మంది మరణించారు. ఇలా భారత్కు జూన్ నెల... వరుస విషాదాలను తీసుకొస్తూ శోకాన్ని మిగులుస్తుంది.