భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అంత కుముందు భూకక్ష్యలో వ్యోమనౌకలో తిరుగుతున్న సమయంలో, అంతరిక్షం నుంచి లైక్కాల్లో మాట్లాడారు. చిన్న పిల్లాడిలా నడవడం, తినడం నేర్చుకుంటున్నానని తెలిపారు. ప్రయాణం అద్భుతంగా ఉందని చెప్పారు. దాదా పు 15 నిమిషాల పాటు లైవ్ కాల్ సాగింది. 'అందరికీ నమస్కారం.. ఇతర వ్యోమగాములతో రోదసీలో ఉండటం చాలా సంతోషంగా ఉంది. వావ్.. ఇది ఎంత అద్భుతమైన ప్రయాణం. రైడ్ మొదలైనపుడు మొదట ఏమి అనిపించలేదు. కానీ కొద్దిసేపటికి అంతా నిశబ్దంగా ఉంది. అందరం గాల్లో తెలుతున్నాం. అదొక అద్భు తమైన అనుభూతి. బుధవారం నింగిలోకి వెళ్లినప్పటి నుంచి నేను చాలా నిద్రపోతున్నాని తోటి వ్యోమగాములు చెప్పారు. నేను అక్కడి దృశ్యాలను, అలాగే స్పేస్ అనుభవాలను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడి. నడవడం నేర్చుకునే చిన్నారిలా.. జీరో గ్రావిటీకి అలవాటు పడు తున్నాను. ఎలా కదలాలో, నన్ను నేను ఎలా నియం త్రించుకోవాలో, ఎలా తినాలో.. తెలుసుకుంటున్నా' అంటూ శుభాంశు శుక్లా తన తొలి అంతరిక్ష అనుభవాలను ఒక సందేశం రూపంలో పంచుకున్నారు.