Sonia Gandhi : రాజస్థాన్ నుంచి రాజ్యసభకు సోనియా గాంధీ నేడు నామినేషన్..!

Update: 2024-02-14 04:45 GMT

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈరోజు రాజస్థాన్‌కు వెళ్లనున్న సోనియా.. ఉదయాన్నే తన నివాసం నుంచి బయలుదేరినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 11న జరిగిన పార్టీ నేతల అత్యున్నత స్థాయి సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, సల్మాన్ ఖుర్షీద్, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు.

1998, 2022 మధ్య దాదాపు 22 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. సోనియా గాంధీ 1999లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కర్ణాటకలోని బళ్లారి నుండి ఎన్నికయ్యారు. 2004లో సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేశారు.

పలు నివేదికల ప్రకారం, ఆమె రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే సమయంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే కూడా హాజరుకానున్నారు. నామినేషన్‌కు చివరి తేదీ ఫిబ్రవరి 15. రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఎన్నికైన మన్మోహన్ సింగ్‌తో సహా 15 రాష్ట్రాల నుండి మొత్తం 56 మంది రాజ్యసభ సభ్యులు ఏప్రిల్‌లో పదవీ విరమణ చేస్తున్నారు.

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆగస్టు 1964 నుండి ఫిబ్రవరి 1967 వరకు రాజ్యసభ సభ్యురాలిగా ఉండగా.. సోనియా గాంధీ గాంధీ కుటుంబంలో రాజ్యసభలోకి ప్రవేశించిన రెండవ సభ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News