"ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారు. అది అసెంబ్లీ ఎన్ని కల్లోనూ కొనసాగేలా నాయకులు కృషి చేయాలి. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాం గ్రెస్ నాయకులు ఆ మేరకు సమాయత్తం కావాలి" అని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ( Sonia Gandhi ) దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను మనం చూశాం.. ప్రజలు మనవైపే ఉన్నారు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమించి పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో వలే ఫలి తాలు రావొచ్చు. అతినమ్మకం పనికిరాదు. లోక్ సభ ఎన్నికల్లో భాజపా మెజారిటీ కోల్పోయింది. అయినా, మోదీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుండా ప్రజ లను వర్గాలుగా విభజిస్తూ, శత్రుత్వాన్ని వ్యాప్తి చేస్తోంది. అని సోనియా గాంధీ చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో రైతులు, యువతను పూర్తిగా విస్మరించారని సోనియా మండిపడ్డారు. కీలకమైన రంగాల్లో పెండింగ్ పనులకు కేటాయింపుల్లో న్యాయం చేయలేదని. విమర్శించారు. జనాభా గణనను నిర్వహించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. విదేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ అల్లర్లతో అతలాకుతలమైన మణిపుర్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. కావడి యాత్రలో విధించిన నియమాలు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని, సుప్రీం కోర్టు సరైన సమయంలో జోక్యం చేసుకుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు
పాలుపంచుకునేలా నిబంధనలను ఎన్డీఏ సర్కార్ అకస్మాత్తుగా ఎలా మార్చిందో చూడాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఊపును, సానుకూలతను కొనసాగించాలని, పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని చెప్పారు.