Supreme Court :హైకోర్టు జడ్జీలపై లోక్‌పాల్ విచారణ ఆదేశాలను నిలిపివేసిన సుప్రీంకోర్టు

Update: 2025-02-20 15:00 GMT

లోక్‌పాల్, లోకాయుక్త చట్టాల కింద హైకోర్టు జడ్జీలపై విచారణకు ఆదేశించడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఆ ఆదేశాలు తమను తీవ్రంగా కలచివేశాయని పేర్కొంది. ఇద్దరు హైకోర్టు జడ్జీలపై Jan 27న లోక్‌పాల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సుమోటోగా తీసుకొని విచారించింది. హైకోర్టు జడ్జీలు లోక్‌పాల్ పరిధిలోకి రారని, చట్టంలో తప్పుగా నిర్వచించారని కేంద్రం తరఫున వాదించిన SG తుషార్ మెహతా సైతం పేర్కొనడం గమనార్హం.

హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ విచారిస్తోంది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27న ఉత్తర్వులు జారీచేసింది. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టి.. స్టే విధించింది. అలాగే సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడిని ఆదేశించింది.

Tags:    

Similar News