ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్క్రాఫ్ట్లో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. మోదీ శుక్రవారం ఝార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో దేవ్ఘర్ విమానాశ్రయంలో ఉన్న విమానంలో సమస్య తలెత్తినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించాల్సి ఉంది. మోదీ తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ హెలికాప్టర్లో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. దేవఘర్కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడ్డా జిల్లాలో ఇవాళ ఉదయం రాహుల్ హెలికాప్టర్లో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో ఆ హెలికాప్టర్ 45 నిమిషాల పాటు భూమిపైనే ఉండిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ కోసం రాహుల్ గాంధీ ఎదురు చూశారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారాన్ని అడ్డుకోవాలనే బీజేపీ.. ఈ పరిస్థితి తెచ్చిందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది.