Madhya Pradesh : మధ్ధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలోని 'గర్భగృహ'లో మంటలు చెలరేగడంతో పూజారులు సహా 14 మంది గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన మార్చి 25న 'భస్మ హారతి' సమయంలో జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పూజారి ఆశిష్ శర్మ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకల సందర్భంగా ఈ సంఘటన జరిగింది. "గులాల్ కారణంగా 'గర్భగృహ'లో మంటలు వ్యాపించాయి. ఆలయ పూజారులు గాయపడ్డారు. మేము వారిని ఆసుపత్రికి తరలించాము..." అన్నారాయన.
తృటిలో తప్పించుకున్న సీఎం కొడుకు, కూతురు
ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె తృటిలో తప్పించుకోవడం గమనార్హం. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో వారు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో భాస్మర్తి ప్రధాన పూజారి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, సేవకుడు మహేష్ శర్మ, చింతామన్ గెహ్లాట్ ఉన్నారు.
ఘటనపై అమిత్ షా ఆరా..
ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి యాదవ్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. "నేను సీఎం మోహన్ యాదవ్తో మాట్లాడి అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాను. స్థానిక యంత్రాంగం క్షతగాత్రులకు అన్ని సహాయాలు, చికిత్సలను అందుబాటులో ఉంచుతోంది..." అని షా జోడించారు.