ఇకపై మంటే...!

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు;

Update: 2023-05-09 06:57 GMT

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇండోనేషియాలో తుఫాన్ ప్రారంభమైంది. దీని వల్ల రాజస్థాన్ నుంచి వేడిగాలులు దక్షిణాది వైపునకు వీయడం మొదలయ్యాయి. దీని వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 11 నుంచి వేడిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News