లోకేష్ పర్యటన ఎవరూ ఊహంచని విధంగా సక్సెస్ అయిందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి. 45 డిగ్రీల ఎండలోనూ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. రైతులతో లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తే వ్యవసాయ మంత్రి ఎనాడైనా సమావేశాలు పెట్టాడా అంటూ ప్రశ్నించారు. రైతులతో సమావేశాలు నిర్వహించే దమ్ము కన్నబాబుకు గాని, కాకాణినికి గానీ లేదన్నారు.