అబ్కారీ శాఖ కళ్లుగప్పేందుకు గంజాయి ముఠాలు వ్యూహాలు మారుస్తున్నాయి. దీంతో అభ్కారీ అధికారులు సైతం వీరి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. తాజాగా అభ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూలీల అవతారం ఎత్తారు. ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిన అధికారులు వ్యవసాయ కూలీల వేషం వేసి గంజాయి ముఠాను పట్టుకున్నారు. తోటి కూలీలులుగా భావించిన కొందరు సమాచారం లీక్ చేయడంతో గంజాయి ముఠాను పట్టుకున్నారు.