సీఎం కేసీఆర్ తో సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ భేటీ కానున్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తో లంచ్ మీటింగ్ లో పాల్గొనున్నారు. పాట్నాలో జరిగిన విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ దూరంగా ఉంది. దీంతో కేసీఆర్, అఖిలేష్ యాదవ్ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. వీరిద్దరు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. బేగంపేట ఎయిర్పోర్ట్లో అఖిలేష్ యాదవ్కు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.