అల్లూరి జిల్లా కూనవరంలో... ఆందోళనకు దిగారు వరద బాధితులు. కూనవరం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గోదావరి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోతే... ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదంటూ మండిపడ్డారు. గిన్నెల దిబ్బ, చేపల బజారులో ఉన్న 50 కుటుంబాలకు చాలీ చాలని నిత్యావసరాలు ఇచ్చారు అధికారులు. కేవలం 4 బంగాళ దుంపలు, 4 ఉల్లిపాయలు, ఓ అరటికాయ ఇచ్చారు. దీంతో ఈ కూరగాయల్ని తిరిగి అధికారులకు ఇచ్చేశారు వరద బాధితులు.