అనకాపల్లి జిల్లా కలెక్టర్ వద్ద.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ... అంగన్వాడీలు36 గంటల మహా ధర్నా చేపట్టారు. ఇవాళ రెండో రోజు.. మహా ధర్నా కొనసాగుతోంది. ఇవాళ కలెక్టరేట్ను ముట్టడించారు అంగన్వాడీలు. పెద్ద సంఖ్యలో వచ్చిన అంగన్వాడీలు... కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే.. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు.... అంగన్వాడీలను.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.