ఎన్నికల కమిషన్ నిబంధనలను అతిక్రమించిన వాలంటీర్.. ఏకంగా బీఎల్వో చేతిలో నుంచి ఓటర్ జాబితా లాక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు సచివాలయం-3 పరిధిలోని దుగినేపల్లి గ్రామంలో బీఎల్వో ప్రియాంకతో పాటు టీడీపీ ఏజెంట్లు ఓటరు జాబితా పరిశీలన చేపట్టారు. వాలంటీర్ బయ్యారెడ్డి తన ఓటు చూసుకోవాలంటూ బీఎల్వో చేతిలోని జాబితాను తీసుకున్నాడు. ఘటనపై తహసీల్దార్కు టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు.ఆర్డీవోకు నివేదిక పంపుతామని చెప్పారు.