సైబరాబాద్ సైబర్ క్రైమ్లో యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. హర్షసాయి ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలు పలు స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు. దీంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పలు సోషల్ మీడియా అకౌంట్ల స్క్రీన్ షాట్స్ ను పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా తెలుగు టాప్ యూట్యూబర్ హర్షసాయి తనను పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి, తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సగంటి తెలిసిందే. ఈ కేసు అనంతరం హర్షసాయి, అతని అభిమానులు తనను నెట్లో ట్రోలింగ్ చేస్తూ.. మానసికంగా వేధిస్తున్నారని తాజా ఫిర్యాదులో పేర్కొంది.