విశాఖలోని రుషికొండ నిర్మాణాలపై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు పనులపై హైకోర్టును ఆశ్రయించారు. పనులు ఆపేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఇప్పటికే కొన్ని సూట్ రూములతో కూడిన ఒక బ్లాకు నిర్మాణం చివరి దశకు చేరగా మరో బ్లాకును కూడా సిద్ధం చేస్తున్నారు. విద్యుత్తు పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండ తవ్వకం పనుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులున్నావాటిని పట్టించుకోలేదు. ఇదే అంశంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ లేఖ రాశారు.