AP BJP: అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి

Update: 2023-07-13 07:00 GMT

బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు. విజయాడ పార్టీ ఆఫీస్‌లో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు. రాబోయే ఎన్నికలలో పురంధేశ్వరి నాయకత్వంలో ముందుకు వెళ్తామని ఇప్పటికే వెల్లడించారు ఏపీ బీజేపీ నేతలు.ఈ నెల 16న ఎన్నికల కార్యాచరణపై ముఖ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్, కార్యాచరణపై చర్చించి అదే రోజు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 


Tags:    

Similar News