ఓటర్ల జాబితాలో కొన్ని తప్పులు దొర్లాయని ఏపీ ఎన్నికల అధికారి ముఖేశ్కుమార్ మీనా అన్నారు. ఒకే ఇంటి నంబర్పై ఎక్కువ ఓట్లు నమోదైన వాటిపై దృష్టి సారించామన్నారు. కొన్ని చోట్ల ఎక్కువ తేడా కనిపిస్తోందన్నారు. విజయవాడ, గుంటూరులో ఇలాంటివి జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి తప్పులు జరిగాయన్నారు. ఆరు చోట్ల 500పైగా ఓట్లు ఒకే ఇంటి నంబర్పై నమోదనట్లు తెలిపారు. ఇక 21వందకు పైగా ఇంటి నంబర్లపై 50 కంటే ఎక్కువ మంది ఓట్లు నమోదయినట్లు తెలిపారు.