ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబంతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన చంద్రబాబు ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు.
అలాగే సీఎం జగన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పులివెందులలోని భాకరాపురం పోలింగ్ కేంద్రంలో జగన్-భారతి దంపతులు ఓటు వేశారు.
హైదరాబాద్ ఫిలింనగర్లో ఓటు వేసిన ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ వేశారు.