ఢిల్లీలో ఏపీ సర్పంచ్లు కదం తొక్కుతున్నారు. వివిధ పార్టీల నేతల్ని కలుస్తున్నారు. జగన్ సర్కార్కు వ్యతిరేకంగా కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఢిల్లీ వచ్చిన సర్పంచుల్లో టీడీపీ, జనసేన సహా అధికార వైసీపీకి చెందిన వారే అధికంగా ఉన్నారు. ఇక తమ సమస్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఏపీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ నిధులను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు.