అనకాపల్లి ఏరియా ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత తలెత్తింది. వేతనాల పెంపు, ఇతర సమస్యలపై ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. డీఎంహెచ్వో బయటకురావాలని ఆశావర్కర్లు నినాదాలు చేశారు. డీఎంహెచ్వో అందుబాటులో లేకపోవడంతో....అడిషల్ డీఎంహెచ్వోకు వినతిపత్రం అందజేశారు.