నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ ఇచ్చిన పిలుపుతో మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల ముట్టడికి కార్యకర్తలు యత్నించారు.. ఇందులో భాగంగా మహమూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించి బైఠాయించారు. పోలీసులు చేరుకుని బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.