అసెంబ్లీ సెక్రటరీకి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇచ్చిన లేఖపై వివాదం నెలకొంది.కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోర్టు ఆర్డర్ సమర్పించిన ఆమె బీజేపీ లెటర్ హెడ్ పై లేఖ ఇచ్చారు. ఒకవేళ శాసనసభ స్పీకర్ డీకే అరుణ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తే ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే గా పరిగణిస్తారు. అయితే స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చే అవకాశం ఉందని పీసీసీ లీగల్సెల్ అంటోంది.ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షరాలుగా ఉన్నారు డీకే అరుణ. దీంతో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.