అధికార బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా హైకమాండ్కు డెడ్లైన్ పెడుతున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పార్టీ మారుతామంటూ సంకేతాలు పంపుతున్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో గులాబీబాస్ నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల జాబితా సిద్ధం చేస్తున్నారు. పార్టీ వీడే నేతల ప్రభావం ఎంత ఉంటుందన్న అంశంపై సర్వేలు కూడా చేయిస్తున్నారట. మరోవైపు ఎంతమంది పార్టీ వీడితే.. అంతమందిని వేరే పార్టీల నుంచి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను మంత్రులు, సీనియర్లకు అప్పగించారు.