ఖమ్మంలో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త బస్టాండ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, సుమారు 60కేజీల గంజాయి బయటపడింది. కొనిజర్ల మండలం లక్ష్మీపురానికి చెందిన కుర్ర సాయికుమార్, రేవతి సెంటర్కు చెందిన గంజాయి వ్యాపారి సైదులు వద్ద నుంచి, గంజాయిని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నాడు. పట్టుబడిన గంజాయి సుమారు తొమ్మిది లక్షల విలువ ఉంటుందని తెలిపారు ఎస్సై ప్రసాద్.