చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. తక్షణమే నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీని ఆదేశించింది. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో చాలాసార్లు భద్రతా వైఫల్యాలు బయటపడ్డాయి. వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు, లోకేష్ భద్రత విషయంలో.. జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు టీడీపీ ఎంపీ కనకమేడల. వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ పర్యటనల్లో భద్రతా వైఫల్యంపై నివేదిక పంపాలని ఆదేశించారు.