ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో అధిపత్య పోరు సాగుతోంది. రామచంద్రాపురంలో మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్ గా పరిస్థితి మారింది. దీంతో రామచంద్రాపురం పంచాయితి తాడేపల్లికి చేరింది. సీఎంఓ నుంచి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు ఫోన్ రావడంతో తాడేపల్లికి చేరుకున్నారు. సీఎం జగన్తో సమావేశం అయ్యారు. మంత్రి వేణు సమక్షంలోనే బోస్ వర్గానికి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ శివాజీ పై దాడి జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన శివాజీ చీమల మందు తాగి ఆత్మాహత్య యత్నం చేశారు.