హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ రన్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్తో పాటు ఒలింపిక్ చైర్మన్ వేణుగోపాల చారి, స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. స్టూడెంట్స్, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల్లో క్రీడా స్ఫూర్తి నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు స్టీరింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి.