ఉత్తరాంధ్ర పై వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. క్రీడా రంగానికి జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే విజయనగరం స్పోర్ట్స్ స్కూల్ని కడపకు తరలించిన సర్కార్. ఉత్తరాంధ్రలోని క్రీడా మైదానాల్లో కాసుల వేట ప్రారంభించింది జీవీఎంసీ.ఇప్పటికే MVP స్పోర్ట్స్ ఏరినా ప్రైవేట్కు ధారాదత్తం చేసిన జగన్ ప్రభుత్వం ఇతర గ్రౌండ్లు,ఇండోర్ స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు.. కట్టపెట్టేందుకు సిద్ధమైంది.స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం,బీచ్ రోడ్ లోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రైవేట్ పరం చేసేందుకు కార్యాచరణ రూపొందించింది.