తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ రెండో విజయం నమోదు చేసింది. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియానాయక్పై 25వేలకు పైగా మెజారిటీతో ఆయన ఘన విజయం సాధించారు. 2014లో హరిప్రియనాయక్పైనే గెలిచిన కోరం కనకయ్య.. 2018లో ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇప్పుడు హరిప్రియపైనే కనకయ్య జయకేతనం ఎగురవేశారు. ఇటు.. రామగుండంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై రాజ్ఠాకూర్ గెలిచారు. మరోవైపు చార్మినార్లో ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీ గెలిచారు. ఈ గెలుపుతో ఎంఐఎం బోణీ కొట్టింది.