VICTIM MEET: మణిపుర్‌ బాధితురాలిని ఓదార్చిన స్వాతి మలివాల్‌

మణిపుర్‌ బాధితురాలిని కలిసి భావోద్వేగానికి గురైన దిల్లీ మహిళా కమిషన్ చీఫ్;

Update: 2023-07-25 08:00 GMT

మణిపుర్ లో వివస్త్రకు గురైన మహిళను దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ పరామర్శించారు. ఇంఫాల్ లో బాధితురాలిని కలుసుకున్న స్వాతి మలివాల్... దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. శనివారం నుంచి మణిపుర్ లో పర్యటిస్తున్న ఆమె...... లైంగిక దాడికి గురైన మహిళలను కలుసుకునేందుకు బీరెన్ సింగ్ అనుమతించడం లేదని ఆరోపించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించడానికి మణిపుర్ ప్రభుత్వం అనుమతించాలని కోరారు. 

Tags:    

Similar News