తెలంగాణలో మెడికల్ కాలేజీలు టార్గెట్గా ఈడీ పంజా విసిరింది. ప్రతిమ, అనురాగ్, ఎస్వీఎస్, కామినేని సహా పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.మెడికల్ కాలేజీలు,వాటి కార్యాలయాలు యాజమాన్యాల ఇళ్లలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కామినేని గ్రూప్స్ యజమానులు శశిధర్, వసుంధర సూర్యనారాయణ ఇళ్లలో సోదాలు చేపట్టారు.ప్రతిమ గ్రూప్స్ ఫిల్మ్ నగర్ కార్పొరేట్ ఆఫీసులోనూ ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి.