హైదరాబాద్లోని DSE కార్యాలయం ముందు విద్యావాలంటీర్లు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యా వాలంటీర్లు రెన్యూవల్ చేయాలని నినదించారు. 2020 సంవత్సరం నుంచి రెన్యూవల్ చేయలేదని మండిపడుతున్నారు. కార్యాలయం గేటు ముందు బైఠాయించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యావాలంటీర్ల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మద్దతు తెలిపారు.