కేసీఆర్కు పోయేకాలం దగ్గరపడిందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. జాతీయస్థాయిలో కేసీఆర్ పరిస్థితి ఎటుకాకుండాపోయిందన్నారు. ఎవరిమద్దతులేక కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయారని సెటైర్లువేశారు. స్థాయిని మరిచి ఎగిరిపడితే ఇట్లానే ఉంటుందన్నారు. జాతీయస్థాయిలో ఏకూటమో కేసీఆర్ చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. పాలించే సత్తాలేక జాతీయ రాజకీయాల పేరుతో కేసీఆర్ ఊరేగుతున్నారని విమర్శించారు.