తమిళనాడు పొన్నై అటవీప్రాంతంలో ఏనుగు బీభత్సం

Update: 2023-08-31 11:37 GMT

తమిళనాడు పొన్నై అటవీప్రాంతంలో ఏనుగు బీభత్సం సృష్టించింది. జనసంచారం ప్రాంతంలోకి వచ్చిన గజరాజు ఓ మహిళను చంపేసింది. ఏనుగు దాడిలో మహిళతో పాటు ఓ ఆవు ప్రాణాలు కోల్పోయింది. పార్క్‌ చేసి ఉన్న బైక్‌ను ఏనుగు ధ్వంసం చేసింది. కుంకి ఏనుగుల సాయంతో దాడికి పాల్పడిన ఏనుగును అటవీ ప్రాంతలోకి తరమడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం రామాపురం ప్రాంతంలో ఏనుగు సంచరిస్తుండటంతో సమీప ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరి ఏనుగును నియంత్రించేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News