విజయనగరం జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. వంగర మండలం మడ్డువలస రిజర్వాయర్ సమీపంలో తిష్టవేసిన ఏనుగుల గుంపు... పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల సంచారంతో గత కొన్ని రోజులుగా వంగర మండల ప్రజలు భయంతో జంకుతున్నారు. మరోవైపు ఏనుగుల సంచారంతో అటవీశాఖ అధికారుల సైతం అప్రమత్తం అయ్యారు. స్థానిక ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారుల తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఏనుగులను కొండ ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేయడం లేదని మండిపడుతున్నారు.