కొందరు పోలీసులు ఖాకీ చొక్కా తీసి వైసీపీ చొక్కా కప్పుకున్నారు అంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లాగా వ్యవహరించారని మండిపడ్డారు.మేము వీరవల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని,ఎమ్మెల్యే వంశీ ఇచ్చిన ఫిర్యాదుపై ఆఘమేఘాలపై స్పందించి టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని విమర్శించిరు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీస్ అధికారుల పేర్లు రెడ్ బుక్ లో లోకేష్ రాసుకుంటున్నారని... అధికారంలోకి రాగానే అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.