దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు మృతి చెందారు.ఇవాళ ఉదయం ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు మహిళలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.చనిపోయిన మహిళలు పింకీ,జ్యోతిగా గుర్తించారు. డబ్బు సెటిల్మెంట్ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.