జగన్ సర్కార్ పబ్లిసిటీ గుడిని, బడిని కూడా వదటం లేదన్న విమర్శలు పెద్దెత్తున వస్తున్నాయి. చివరికి సర్కారీ స్కూళ్లలో జగన్ నామస్మరణ చేయిస్తున్నారు.స్వామి భక్తి చాటుకుంటున్నారు ఫుడ్ కమిషన్ సభ్యురాలు దేవి.గవర్నమెంట్ అంటే ఎవరు అంటే జగన్ మామ అంటూ గుంటూరు జిల్లా తెనాలి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్ధినిలతో వల్లె వేయించారు. పిల్లలు చిన్నగా అంటే తనకు వినిపించలేదని చెప్పి మరీ గట్టిగా చెప్పించారు. అయితే ఈ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సర్కారీ స్కూళ్లలో డ్రామాలేంటని మండిపడుతున్నారు పేరంట్స్.