కాసేపట్లో 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశం ఎజెండాలో ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం స్థూల గేమింగ్ ఆదాయంపై 28 శాతం చొప్పున పన్ను విధించాలా అనే విషయాన్ని కౌన్సిల్కు వదిలివేసింది. దీని ప్రకారం, సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం మందులు, ఆహారంపై పన్ను రేటును 12 శాతానికి తగ్గించడం వంటి ప్రతిపాదనలపై చర్చ జరగనుంది.