కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్నాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి సైతం వరద నీరు భారీగా వస్తుండటంతో హోస్పెట్ టీబీ డ్యాంకి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. క్రమక్రమంగా టీబీ డ్యామ్కు వరద నీరు పెరుగుతుంది. టీబీ డ్యాం గరిష్ట నీటి మట్టం 16వందల 33 అడుగులు కాగా.. ప్రస్తుతం 16వందల 11 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. వరద ఉధృతి నేపథ్యంలో సాగునీటి కాలువలకు 198 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.