పెద్దపల్లి జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో గోపాల్ పూర్ ఇసుక క్వారీలో 15 మంది చిక్కుకున్నారు. అయితే ప్రవాహం క్రమక్రమంగా పెరగడంతో వీరిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మరోవైపు ఒక్కసారిగా వరద పోటెత్తడంతో కంటైనర్తో పాటు జేసీబీ సైతం వరదల్లోనే చిక్కుకుపోయింది. మరోవైపు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.