భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ మధ్యలో మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్యాన్సర్ అవతారం ఎత్తాడు. డ్యాన్సింగ్ మూమెంట్స్తో అభిమానులను అలరించాడు. ఇదే టెస్టులో శుభ్మన్ గిల్ ఇలాగే డ్యాన్స్ చేసి అలరించాడు. మరోవైపు ఇదే మ్యాచ్ లో కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున అత్యధిక టెస్టు పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలోకి చేరడంతో పాటు, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ని అధిగమించాడు.